
క్రీడలు

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించి జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో మహారాష్ట్ర, గుజరాత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అని అన్నారు.
పశ్చిమ భారత అభివృద్ధిలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, అలాగే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయుల సేవలను కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం దేశ ఐక్యతను బలోపేతం చేస్తోందని తెలిపారు. హైదరాబాద్లో నివసిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నారని ప్రశంసించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!