
గాసిప్స్

విద్యా సంస్థలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో, శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరుపుకునే మూడు రోజుల పండుగకు ముందే ప్రయాణాలు ప్రారంభమవడంతో, హైవేపై వాహనాల సందడి నెలకొంది.
వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును మూసివేయగా, పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్లలో 10 ను విజయవాడ మార్గంలో తెరిచారు. ఫాస్టాగ్ విధానం అమలులో ఉండటంతో పాటు అదనపు టోల్ సిబ్బందిని నియమించడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. శని, ఆదివారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!