

ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ కాలంలో బ్యాంకు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.31,851.15 కోట్ల ఆదాయంపై రూ.5,503 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 9.8% పెరిగినప్పటికీ, అనుబంధ సంస్థల లాభాలను మినహాయిస్తే వృద్ధి 6.6%గా ఉండి రూ.5,316 కోట్లకు చేరింది.
అయితే, ఈ సమయంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (NII) 1.14% తగ్గి రూ.9,406 కోట్లకు పడిపోయింది. దీంతో నికర వడ్డీ మార్జిన్ (NIM) 2.87% నుంచి 2.64%కు తగ్గింది. రుణ వృద్ధి రేటు కూడా 10%కు మించలేదు. అయినప్పటికీ, వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.5 డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో కంపెనీలకు ఇచ్చే రుణాలు రూ.55,000 కోట్లకు చేరవచ్చని యూబీఐ ఎండీ మరియు సీఈఓ అశీశ్ పాండే తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.30,000 కోట్ల రుణాలకు ఆమోదం లభించినట్లు ఆయన వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!