

కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సాధించిన కొత్త వైద్య పురోగతి ప్రపంచ వైద్యరంగంలో సంచలనం సృష్టిస్తోంది. అడ్వాన్స్డ్ హెల్త్కేర్ మెటీరియల్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, అయస్కాంత మైక్రో రోబోలు భవిష్యత్తులో శస్త్రచికిత్స లేకుండానే మూత్రపిండ రాళ్లను కరిగించగలవని వెల్లడైంది.
ఈ చిన్న, మృదువైన రోబోటిక్ స్ట్రిప్స్ మూత్రనాళంలో ప్రయాణించి, బయట నుంచి అయస్కాంత క్షేత్రాల సహాయంతో వైద్యులు రాయి ఉన్న ఖచ్చితమైన ప్రదేశానికి దారి చూపించగలరు. ఎలాంటి కోతలు లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించే వీలుంది.
యూరియేస్ అనే ఎంజైమ్తో రూపొందించిన ఈ మైక్రో రోబోలు యూరిక్ ఆమ్ల రాళ్లను క్రమంగా కరిగిస్తాయి. ప్రయోగశాల పరీక్షల్లో కేవలం ఐదు రోజుల్లో రాళ్లు సుమారు 30 శాతం వరకు చిన్నవైనట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసే మూత్రపిండ రాళ్లకు ఇది నొప్పిలేని, శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!