

కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం, భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో వెళుతున్న ఓ కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతూ మరో కోల్కతా నుంచి చెన్నైకు కాటన్ వెస్ట్ బండిల్స్ లోడుతో వెళ్తున్న కంటైనర్తో ఢీ కొట్టింది.
ఘటనా ప్రభావంతో రెండు కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ (43) సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సజీవ దహనమైన డ్రైవర్ కోల్కతాకు చెందిన వ్యక్తిగా గుర్తించబడినట్లు ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!