

హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా పరిస్థితి, వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొనే చర్యలు, అలాగే 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ను పూర్తిగా అరికట్టాలని, ఎక్కడైనా వినియోగదారులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలు, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!