

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ రికార్డు స్థాయిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో కార్లను తయారు చేసిన సంస్థగా మారుతీ సుజుకీ నిలిచిందని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఈ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం చాలా కొద్ది సంస్థలకు మాత్రమే సాధ్యమని కంపెనీ పేర్కొంది.
మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాలుగా నిర్మించిన బలమైన వ్యవస్థ, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు భారత్ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు ప్లాంట్లు నిర్వహిస్తున్న కంపెనీ, గుజరాత్లోని ఖోరజ్లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో డిజైర్, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా, బాలెనో మోడళ్లు అత్యధికంగా ఉత్పత్తి అయిన కార్లుగా నిలిచాయి.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!