
ఓటిటి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మా-మాటి-మానుష్’ సిద్ధాంతం మరోసారి విజయం సాధిస్తుందని పేర్కొంటూ, బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడాలని, విభజన శక్తులను తిరస్కరించాలని ఓటర్లను కోరారు. రెండో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎక్స్లో ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ సందేశం విడుదల చేశారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో విభజన, విధ్వంసకర శక్తులకు స్థానం లేదని అన్నారు. ఐకమత్యం, సంస్కృతి, నాగరికత బెంగాల్ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి అన్ని దిశల్లో కొనసాగుతోందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రజలే సరైన తీర్పు ఇస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!