
టెక్నాలజీ

న్యూ ఇయర్ రోజున ఇంట్లో కుటుంబంతో ప్రశాంతంగా గడపాలా? లేక జైలులో ఉండాలా? అనే నిర్ణయం ప్రజలే తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే తప్పనిసరిగా జైలుశిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రజలు పూర్తి జాగ్రత్తలు పాటించాలని సీపీ సజ్జనార్ సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!