
-1774425417157.webp&w=3840&q=75)
'అవతార్' సినిమాల గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు మూడు భాగాలు విడుదల కాగా, ఇంకా రెండు భాగాలు రావాల్సి ఉన్నాయి. 2009లో వచ్చిన మొదటి సినిమా భారీ విజయం సాధించింది. 2022లో వచ్చిన 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' కూడా మంచి స్పందన పొందింది. గతేడాది డిసెంబర్ 19న విడుదలైన మూడో భాగం'అవతార్ ఫైర్ అండ్ యాష్' మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు థియేటర్లలో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 31 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ మరియు ఆపిల్ టీవీ ప్లస్ లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్లో ఇది ప్రస్తుతం ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక భారతదేశంలో డిజిటల్ హక్కులు ఉన్న హాట్స్టార్లో వచ్చే నెల లేదా మే నెలలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం.
'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకుని కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.








.webp&w=3840&q=75)









.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!