

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 45 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ పేరిట ఈనెల 10 వ తేదీ నుంచి వచ్చే నెల 25 వ తేదీ వరకు ఈ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈనెల 10 న జిల్లా స్థాయిలో విలేకరుల సమావేశాలు నిర్వహించి, రోజంతా నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు. 11 న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని, 12 నుంచి 29 వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ స్థాయి సమావేశాలు, ఇంటింటికీ తిరిగి చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 30 న వార్డు స్థాయిలో శాంతియుత ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఫిబ్రవరి 7 నుంచి 15 వ తేదీ వరకు విధాన సభల వద్ద రాష్ట్ర స్థాయి ఘెరావ్లు చేపడతామని, ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు నాలుగు ప్రధాన ర్యాలీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ ఆందోళనల ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని రక్షించుకోవడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!