

ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ అధికారికంగా ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున మెస్సీ తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువారెజ్తో కలిసి కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ భద్రత నడుమ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన వారి తొలి దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ రోజు మధ్యాహ్నం వరకు కోల్కతాలో గడిపిన అనంతరం మెస్సీ హైదరాబాద్కు బయల్దేరనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని ఉప్పల్ స్టేడియంలో జరిగే హై-వోల్టేజ్ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి టీమ్తో మెస్సీ జట్టు మధ్య ఈ ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ అనంతరం మెస్సీతో ఫోటో సెషన్ ఏర్పాటు చేయగా, ఒక్క ఫోటోకు రూ.10 లక్షల ఫీజు నిర్ణయించారు. ఈ అరుదైన అవకాశానికి ఇప్పటికే దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతి రెడ్డి తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!