

జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53 వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 24 న ఆయన పదవిలోకి వచ్చి, ఫిబ్రవరి 9, 2027 వరకు ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ తరువాత బాధ్యతలు చేపట్టిన ఆయన నియామకం భారత న్యాయవ్యవస్థకు మరో ముఖ్యమైన అధ్యాయాన్ని తెరిచింది.
హరియాణా లోని హిసార్ జిల్లాలో పెట్వార్ గ్రామం లో ఫిబ్రవరి 10, 1962 న జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 1984 లో రోహ్తక్ లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అదే సంవత్సరం హిసార్ జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన ప్రయాణం ప్రారంభించి, 1985 లో పంజాబ్ హరియాణా హైకోర్టుకు మారారు. రాజ్యాంగ, సర్వీస్, సివిల్ కేసుల్లో నైపుణ్యం సంపాదించిన ఆయన 2000 లో హరియాణా చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అడ్వకేట్ జనరల్గా నియమితులై, సీనియర్ అడ్వకేట్గా గుర్తింపు పొందారు.
2004 లో పంజాబ్–హరియాణా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఉన్న ఆయన, 2018 లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందిన ఆయన, ప్రస్తుతం NALSA ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, అలాగే ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ పలు కమిటీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం ఆయన విశిష్ట న్యాయ జీవితానికి మరో గుర్తింపు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!