
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు.
ఇక దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించారన్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఇది మానసిక యుద్ధంలో భాగమని, తమ నాయకులు ప్రజల మధ్యే ఉంటారని రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ సైనిక అధికారి అలీ లారిజానీ, బసీజ్ మిలీషియా అధిపతి గులాం రెజా సాల్మనీ మృతి చెందినట్లు సమాచారం. లారిజానీ తన కుమార్తె ఇంట్లో ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని, ఆయనతో పాటు కుమారుడు మరియు సహాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
.jpg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!