
సినిమాలు

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి కార్మికుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మూడు రోజుల వేతనాలు చెల్లించేందుకు, సమ్మె కేసులను ఎత్తివేయేందుకు సీఎం అంగీకరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!