

యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫైనల్ కట్ చూసిన తర్వాత మేకర్స్కు ఒక షాకింగ్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
షూటింగ్ సమయంలో యష్, కియారా మధ్య కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లు చిత్రీకరించారట. అప్పట్లో ఆమె అంగీకరించినప్పటికీ, ఇప్పుడు ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆ సీన్లు తన ఇమేజ్కు ప్రభావం చూపుతాయేమోనని కియారా ఆందోళన చెందుతున్నారట. అందుకే ఆ సీన్లను పూర్తిగా తొలగించమని లేదా తగ్గించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సీన్లు కథలో కీలకమని, వాటిని తీసేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!