
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి హైదరాబాద్లో నివాళులర్పించారు. వారి నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించిన సీఎం, తెలుగు ప్రజలు ఒక గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయారని తెలిపారు. రీజెన్సీ గ్రూప్ స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు.
జీఎన్ నాయుడుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం, ఆయన పరిశ్రమలతో పాటు సమాజ సేవలోనూ కీలక పాత్ర పోషించారని అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీఎన్ నాయుడు వారసత్వం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!