

మహిళల క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో మహిళా క్రికెటర్లు సాధిస్తున్న విజయాలు చరిత్రలో నిలిచిపోతున్నాయి. 2025 వన్డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టు ఇప్పుడు మరో పెద్ద విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది. 2026 జూన్ 14 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసిన భారతి ఫుల్మాలీ, నందిని శర్మలకు కూడా జట్టులో అవకాశం లభించింది. పేస్ విభాగానికి రేణుకా సింగ్ ఠాకూర్ నాయకత్వం వహించనుండగా, స్పిన్ విభాగంలో రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి కీలక పాత్ర పోషించనున్నారు. అనుభవజ్ఞులైన హర్లీన్ డియోల్, స్నేహ రాణా ఈసారి జట్టులో చోటు కోల్పోయారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!