

ఇండోనేసియా లోని సుమత్రా ద్వీపాన్ని బలమైన భూకంపం బాధితులను ఇంకా వదలలేదు. ఈ విపత్తు లో ప్రాణ నష్టం వేగంగా పెరుగుతోంది. శనివారం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 279 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటివరకు 31 మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగామని, ఇంకా 174 మంది గల్లంతైన వారిని వెతికే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
సుమారు 28,400 మంది తాత్కాలిక సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వారికి అవసరమైన ఆహారం, నీరు, వైద్య సరఫరాలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిని కనుగొనడం కోసం 3,500 మంది పోలీసులతో పాటు రక్షణ బృందాలు నిరంతరం శోధన కొనసాగిస్తున్నాయి.
భూకంప తీవ్రత కు సుమత్రాలో రహదారులు చీలిపోయాయి, కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయి, వేలాది ఇండ్లు మరియు భవనాలు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగడంతో కొండ ప్రాంతాల్లోని అనేక గ్రామాలు నీటిలో కొట్టుకుపోయాయి. పశ్చిమ సుమత్రాలోని ఆగమ్ జిల్లాలో మూడు గ్రామాల్లో దాదాపు 80 మంది ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!