

భారత రైల్వే చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచే హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రత్యేక రైలు జీంద్–సోనీపత్ మార్గంలో ప్రయాణించనుంది.
ఈ రైలుకు అవసరమైన ఇంధన సరఫరా కోసం జీంద్లో ఆధునిక హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ రోజుకు 3,000 కిలోగ్రాముల సామర్థ్యంతో పనిచేయనుండగా, 11 కేవీల విద్యుత్ సరఫరా ద్వారా నిరంతరాయంగా ఇంధనం అందించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పర్యావరణహితంగా, కాలుష్య రహిత రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. దక్షిణ హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్ అధికారులతో చర్చించి, విద్యుత్ సరఫరా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా, త్వరలోనే ఈ చారిత్రాత్మక రైలును అధికారికంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!