
రాజకీయాలు

గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు మార్గాలపై యూకేలో నిర్వహించిన సమావేశంలో 60కి పైగా దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దాడుల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ అని తెలిపారు. ఇప్పటివరకు కనీసం ముగ్గురు భారత నావికులు ఈ ప్రాంతంలో మరణించారు. ఈ ఘటనలు నావికుల భద్రతపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
ఈ సమస్యకు యుద్ధం కాకుండా చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించింది. అన్ని దేశాలు కలిసి శాంతిని కాపాడుతూ నావికుల ప్రాణాలను రక్షించాలని భారత్ కోరింది.




.jpg.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!