.jpg&w=3840&q=75)

దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య రంగాలకు గ్యాస్ కేటాయింపును మరో 20% పెంచింది. దీంతో మొత్తం సరఫరా 50%కి చేరింది. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మొదట్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరాలను తగ్గించారు. ఇళ్లలో వినియోగించే గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడటంతో దశలవారీగా సరఫరాను పెంచుతూ ప్రస్తుతం 50%కు చేర్చారు.
ఈ అదనపు కేటాయింపుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య సంస్థలు చమురు కంపెనీల వద్ద నమోదు చేసుకుని పైపుల ద్వారా సహజ వాయువు కనెక్షన్కు దరఖాస్తు చేయాలి. ఇక గృహ వినియోగ గ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని, సిలిండర్ల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!