

సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున ప్రయాణికుల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది, కానీ రైళ్ల రిజర్వేషన్ల పరిస్థితి వారిని నిరాశపరిచేలా ఉంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రెగ్యులర్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయాయి. వెయిటింగ్ లిస్ట్లో కూడా 250–350 మంది కంటే ఎక్కువ చేర్చడం సాధ్యంకాదు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా సుమారు 25–30 లక్షల మంది ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్తారు. ఈ క్రమంలో రైల్వే, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపై భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, తిరుపతి వంటి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటయినప్పటికీ, వెయిటింగ్ లిస్ట్ రికార్డ్ స్థాయికి చేరుతోంది. రైల్వే అధికారులు ఇంకా అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రయాణికులు చివరి క్షణాల్లో ప్రైవేట్ వాహనాలు, బస్సులు, విమానాలను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంలో సొంత ఊళ్లకు చేరడం సవాలుగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!