

మద్రాసు హైకోర్టులో నటుడు, టీవీకే అధినేత విజయ్కు ఊరట లభించలేదు. ఆదాయపన్ను శాఖ విధించిన జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాలంటూ ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను వ్యతిరేకిస్తూ విజయ్ 2022లో కోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తాజాగా పిటిషన్ను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది.
ఆదాయపన్ను శాఖ వివరాల ప్రకారం, 2015–16 ఆర్థిక సంవత్సరంలో విజయ్ రూ.35 కోట్ల ఆదాయం పొందినట్లు ఆయన దాఖలు చేసిన రిటర్న్ను పరిశీలించారు. అయితే, మదింపులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ‘పులి’ సినిమాకు గాను తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని తేలింది. ఈ ఆదాయాన్ని దాచినందుకు ఐటీ శాఖ రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయ్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆయన వాదనలను అంగీకరించలేదు.
ఇదిలా ఉండగా, విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ కూడా వివాదంలో చిక్కుకుంది. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!