
క్రీడలు

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. ఆమె బీజేపీలో చేరే అవకాశంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యం పెరిగింది.
ఇటీవల మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రీతి రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలకు సంబంధించినదని, ముఖ్యంగా 2029లో మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశంపై చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రెండు రోజుల క్రితం రామచందర్ రావును కూడా ఆమె కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ వరుస భేటీలతో ఆమె రాజకీయ ప్రవేశం మరియు భవిష్యత్తు లక్ష్యాలపై చర్చలు మరింత వేగం అందుకున్నాయి.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!