
న్యూస్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్గా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమ, విశ్వాసం, సహకారం వల్లే ఈ సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి డి. శ్రీధర్ బాబుల మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మాజీ కమిషనర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. పదవీకాలం ముగిసినా హైదరాబాద్ అభివృద్ధికి తన కట్టుబాటు కొనసాగుతుందని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!