

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అయితే గత పదేళ్లుగా వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్లు మరియు డీలిమిటేషన్ను కలిపి చూపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నదని ఆరోపించారు. మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించడం నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ పదవుల్లో అవకాశాలు ఇవ్వడం వరకు కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు.
డీలిమిటేషన్ విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఉత్తర-దక్షిణ మధ్య వ్యత్యాసం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 272 సీట్ల పెంపులో 136 సీట్లను ప్రోరేటా విధానంలో, మిగతా 136 సీట్లను స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) ఆధారంగా కేటాయించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి, నిపుణుల అభిప్రాయాలు, రాష్ట్ర అసెంబ్లీల సూచనలు తీసుకోవాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!