

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం, బూట్లు మరియు బెల్టులు కూడా ఇవ్వాలన్న విద్యాశాఖ ప్రతిపాదనకు సీఎం సమ్మతి తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో తొలి విడతలో బాలికలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం అల్పాహారం అందించాలని కూడా ఆదేశించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!