
క్రీడలు

చెన్నైలోని చేపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో గురువారం టీ20 పురుషుల వరల్డ్ కప్-2026 క్రికెట్ మ్యాచ్ భారత్ మరియు జింబాబ్వే జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశముండటంతో, ప్రయాణ సౌకర్యాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు కలిగిన ప్రేక్షకులు మెట్రో రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) బుధవారం ప్రకటించింది. టికెట్ కలిగిన వారికి ఒకసారి వెళ్లి రావడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!