
.jpg&w=3840&q=75)
పండుగల సమయం కావడంతో ప్రజలను మోసం చేయడానికి సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తాజాగా PhonePe పేరుతో ‘పొంగల్ గిఫ్ట్’ అంటూ రూ.5,000 బహుమతి ఇస్తామని చెబుతూ నకిలీ లింకులు పంపిస్తున్నారు. ఈ లింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నకిలీ లింకులను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాల వివరాలు దుర్వినియోగం కావడంతో పాటు, ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. పండుగ బహుమతుల పేరుతో వచ్చే మెసేజ్లు, లింకులపై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో భారీ అంతర్జాతీయ సైబర్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.547 కోట్ల మేర మోసానికి పాల్పడిన ముఠాను గుర్తించి, 18 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన సైబర్ నేరాలు ఎంతటి స్థాయిలో జరుగుతున్నాయో చూపిస్తోంది.
ఇలాంటి అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని, తమ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ను సంప్రదించాలని కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!