

విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ ₹1 కోటి ప్రమాద బీమా చెక్కులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అందజేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ చెక్కులు పంపిణీ చేయగా, బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచినట్లు సీఎం తెలిపారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. సీపెక్ సర్వే ప్రకారం గుర్తించిన కుటుంబాలకు ₹5 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. విద్యుత్, సింగరేణి కార్మికులకు ₹1 కోటి పైగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మృతి చెందిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబాలకు స్వయంగా చెక్కులు అందజేసి ఉద్యోగుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.





















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!