
సినిమాలు

భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం న్యూఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా పాల్గొంటున్నారు.
ఇప్పటికే వీరు భారత్ చేరుకుని, న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. ఈ నెల 27 న జరగనున్న 16 వ భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో వీరు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొననున్నారు. భారత పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా వారు సమావేశం కానున్నారు.
ప్రతి ఏటా జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ వేడుకలకు ప్రతి సంవత్సరం ముఖ్య అతిథులుగా విదేశీ నేతలు హాజరవుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!