

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ నివారణకు ఈగల్ టీం హైదరాబాద్ నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. నగరంలోని పలు పబ్లపై మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు, కొండాపూర్లోని క్వేక్ ఎరేనా పబ్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ర్యాపిడ్ కిట్లతో కస్టమర్లకు పరీక్షలు నిర్వహించగా, ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది.
ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డిసెంబర్ 19న మాసబ్ ట్యాంక్ వద్ద ట్రూప్ బజార్కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేయగా, వారి నుంచి రకుల్ సోదరుడు తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ వ్యవహారంలో అమన్ప్రీత్ పాత్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది నార్సింగి పరిధిలో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా కేసులోనూ అతడు కీలకంగా ఉన్నట్టు గుర్తించి, పరీక్షల్లో డ్రగ్స్ వినియోగించినట్టు నిర్ధారించారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!