
సినిమాలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కంటి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యాక నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమెకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
ఆసుపత్రి నుంచి నేరుగా ఆమె ఢిల్లీలోని అధికారిక నివాసం 10 జనపథ్కు చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఇది వయోసహజంగా వచ్చే కంటి సమస్యకు సంబంధించిన చికిత్సగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!