

దుబాయ్లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రాకుండా ఉండాలని కంపెనీ సూచించింది. ఈ సమయంలో దుబాయ్ ఎయిర్పోర్టుపై మరో మిస్సైల్ దాడి జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన భీకర దాడికి స్పందిస్తూ, ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిస్సైల్ దాడి కారణంగా ప్రయాణికులు భయంతో ఎయిర్పోర్టులో పరుగులు తీశారు.
ఈ దాడికి ప్రతిస్పందనగా, యూఏఈ వైమానిక దళం ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డుకుంది. భద్రతా కారణాల వల్ల దుబాయ్ ఎయిర్పోర్టులో అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు దుబాయ్కు వచ్చే, వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసారు.
దీనితో పాటు, ఇరాన్ అధ్యక్షుడు పొరుగు దేశాలకు క్షమాపణలు ప్రకటించారు. భవిష్యత్తులో పొరుగు దేశాలపై ఎలాంటి దాడులు జరగకూడదని, అవసరమైతే కేవలం ప్రతిదాడి సందర్భంలోనే చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఇరాన్ తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ కూడా అంగీకరించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!