
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడులతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. రన్వేపై పేలుళ్లు, మంటలు చెలరేగడంతో యుద్ధభూమిని తలపించే పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలోని ఇంధన నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దూసుకొచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, సిబ్బందిలో తీవ్ర భయం నెలకొంది.
ఈ ఘటన అనంతరం భద్రతా కారణాల వల్ల విమానాశ్రయ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇతర దేశాల నుంచి దుబాయ్కు వస్తున్న పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర బృందాలు చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.




.jpeg&w=3840&q=75)


.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!