

బాలీవుడ్లో విజయవంతమైన ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన బోర్డర్ సినిమా సీక్వెల్ అయిన బోర్డర్ 2 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. 1997లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన బోర్డర్ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం 1971 భారత్ – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భారత సైనికుల ధైర్యం, త్యాగం మరియు దేశభక్తిని ఈ సినిమాలో చూపించారు. ప్రేక్షకుల్లో దేశభక్తి భావాన్ని పెంచేలా కథను తెరకెక్కించారు. పార్ట్-1 మాదిరిగానే ఈ చిత్రం కూడా యుద్ధ పరిస్థితులను బలంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బోర్డర్ 2 సినిమా ఈ నెల 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇది ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.275 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.485 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో సినిమా కూడా తీయాలని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.


.jpeg&w=3840&q=75)


.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!