

ఉత్తర ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న లనాజ్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. రోజుకు సుమారు లక్ష బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీపై మూడు డ్రోన్లతో దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేంద్రం ప్రాంతీయ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించడంతో పాటు అమెరికా సైనిక బేస్లకు ఇంధనం సరఫరా చేసే కేంద్రంగా కూడా ప్రాముఖ్యత పొందింది.
దాదాపు 1.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ రిఫైనరీ సముదాయం, కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురును ప్రాసెస్ చేసి స్థానిక మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్కు సరఫరా చేస్తుంది. హర్మూజ్ జలసంధి, టర్కీ, ఇరాన్ వంటి మార్గాల ద్వారా ముడి చమురు రవాణా జరిగే ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల ఈ రిఫైనరీకి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. కుర్దిస్తాన్ ప్రాంతంలో అమెరికా సైన్యం స్థానిక భద్రతా దళాలకు శిక్షణ మరియు మద్దతు అందిస్తున్న నేపథ్యంలో ఈ దాడి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!