

భారత్లో డయాబెటిస్ సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో దాదాపు 20 కోట్ల మంది షుగర్తో బాధపడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం 10 కోట్ల మంది ఇప్పటికే డయాబెటిస్తో జీవిస్తుండగా, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. ఈ పరిస్థితి దేశంలో జీవనశైలి మార్పులు, పట్టణీకరణ, జంక్ ఫుడ్ వినియోగం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి కారణాల వల్ల వేగంగా పెరుగుతోంది.
ICMR–INDIAB అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ ప్రబల్యం సగటున 11.4 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతంగా ఉంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి సంకేతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకర జీవనశైలి, క్రమమైన వైద్య పరీక్షలే ఈ ముప్పును తగ్గించే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!