

పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ కేసు నవంబర్ 14వ తేదీన విచారణకు రానుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు గతంలో మూడు నెలల గడువు ఇచ్చింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయితే, ఎమ్మెల్యేల వివరణలు ఇంకా సేకరించాల్సి ఉండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ కార్యాలయం కోర్టును కోరింది. గత నెల 25న అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో, ఫిరాయింపు కేసులపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని, తుది నిర్ణయానికి కొంత సమయం అవసరమని వివరించారు.
ఇప్పుడు ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట నవంబర్ 14న విచారణకు లిస్ట్ అయింది. స్పీకర్ కార్యాలయానికి అదనపు గడువు ఇస్తుందా? లేక గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై హెచ్చరిక జారీ చేస్తుందా? అన్నది ఆ రోజు తేలనుంది.
ఈ విచారణ తెలంగాణ రాజకీయ వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (2)
ఈ కేసు తీర్పు తెలంగాణ రాజకీయాల దిశను ప్రభావితం చేయవచ్చు
Political heat