

కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకారేతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, క్రీడాకారుల కేంద్రంగా నిర్వహించేందుకు తన బలమైన సంకల్పాన్ని తెలిపింది. అలాగే పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం, సమర్థవంతమైన నిర్వహణపై తన ప్రణాళికను వివరించింది.
ఈ సమావేశంలో మంత్రి మాండవీయా మాట్లాడుతూ భారత్ ప్రపంచ దేశాల క్రీడాకారులను ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, క్రీడలపై ఉన్న ఉత్సాహం గురించి చెప్పారు. కామన్వెల్త్ స్పోర్ట్ బృందం ప్రధాని నాయకత్వంలో జరుగుతున్న ఖేలో ఇండియా వంటి క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించింది. సన్నాహాలు, సమన్వయం, దీర్ఘకాల ప్రయోజనాలపై చర్చలు జరిగాయి. మంచి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ కారణంగా అహ్మదాబాద్ను బలమైన హోస్టింగ్ నగరంగా పరిగణించారు.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!