
టెక్నాలజీ

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చలి మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ జిల్లాల్లో ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు.
కొమురం భీమ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు తీవ్రంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నిన్న సిర్పూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు సమాచారం.
అదే సమయంలో, నవంబర్ 22 న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 22 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!