
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లిలో నల్ల చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ముఖ్యమంత్రి హోదాలో కూకట్పల్లికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
చెరువుల పునరుద్ధరణ వల్ల వరదల సమయంలో ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా కాపాడవచ్చని సీఎం తెలిపారు. పేదలను ఇబ్బంది పెట్టడం లేదా ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన పేర్కొన్నారు. చెరువులు, నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించి నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కల్పించడంతో పాటు చిన్నారుల కోసం ఆటస్థలాలు అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించి మూసీ నది ప్రక్షాళన చేపట్టి నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.




.png&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!