

నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, తన కోసం ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందిన ఓ అభిమాని గుడి కట్టిన ఘటనపై స్పందించారు. ఆ విషయం తెలిసినప్పుడు తాను కూడా ఆశ్చర్యపోయానని, అలాంటి గౌరవానికి తాను అర్హురాలిని కాదని అన్నారు.
తనను అభిమానులు ఇంతగా ప్రేమించడం దేవుడు ఇచ్చిన అదృష్టమని సమంత పేర్కొన్నారు. అయితే ఆ అభిమానితో మాట్లాడిన తర్వాత తన ఆరోగ్యం బాగోలేని సమయంలో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ గుడి నిర్మించి పూజలు చేశాడని తెలుసుకుని ఎంతో సంతోషించానన్నారు. అభిమానుల ప్రేమ తనను ఎప్పుడూ భావోద్వేగానికి గురిచేస్తుందని చెప్పారు. గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు సరదాగా తనను ఆటపట్టించారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!