

హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఆదివారం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై నిరసన వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం కోసం సంస్కరణలు అవసరమని పిలుపునిచ్చారు.
సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ విద్యార్థులు భయపడకుండా తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే వాతావరణం దేశంలో ఉండాలని అన్నారు. పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఉద్యమం జూన్ 20న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసనతో ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!