

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. విజయవాడ–చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను నర్సాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నర్సాపురం రైల్వే స్టేషన్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.
గతంలో విజయవాడ–చెన్నై మధ్య మాత్రమే నడిచిన వందే భారత్ను నర్సాపురం వరకు పొడిగించాలనే ప్రజల విజ్ఞప్తులను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. ఈ పొడిగింపుతో నర్సాపురం, భీమవరం, గుడివాడ ప్రాంతాలతో పాటు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది. 20678/20677 నంబర్లతో నడిచే ఈ రైలు తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.




















కామెంట్స్ (1)
Vande Bharath..