
సినిమాలు
.jpeg&w=3840&q=75)
మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్పై సీసీఎస్ పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సుమారు 25 బృందాలు ఒకేసారి తనిఖీలు నిర్వహించి సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించాయి.
మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్యూనెట్పై సీసీఎస్లో ఆరు కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదవడంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. సంస్థ ఆర్థిక లావాదేవీలు, వ్యాపార విధానాలపై అధికారులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!