

సింగపూర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుని, ప్రయాణికులను దింపిన అనంతరం విమానాన్ని ఖాళీ టెర్మినల్ వద్దకు తరలించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఇది నకిలీ బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మొత్తం 23 నకిలీ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలకు పాల్పడిన కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరికొందరు విదేశాల నుంచి ఈ-మెయిల్ల ద్వారా బెదిరింపులు పంపినట్లు విచారణలో బయటపడింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!