
.png&w=3840&q=75)
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పైలట్ ఇన్ కమాండ్గా వ్యవహరించిన కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా ఉన్నారు. అయితే వాస్తవానికి ఆ రోజు విమానం నడపాల్సింది సుమిత్ కాదని, చివరి నిమిషంలో ఆయనకు విధులకు రావాలని పిలుపొచ్చిందని స్నేహితులు మీడియాకు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం ఉన్న పైలట్ ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో టేకాఫ్కు కొన్ని గంటల ముందు సుమిత్కు కాల్ వచ్చిందని తెలిపారు. ఉదయం 8 గంటలకు ముంబయి నుంచి బయలుదేరిన ఆయన గంటలోపే ప్రమాదానికి గురవుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఇటీవలే హాంకాంగ్ నుంచి తిరిగొచ్చిన సుమిత్కు 15 వేల గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, సుమిత్ అలాంటి పొరపాట్లు చేసే వ్యక్తి కాదని అతని స్నేహితులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు కోరుతున్నారు.
దిల్లీకి చెందిన 62 ఏళ్ల సుమిత్ కపూర్ ఎయిర్ఫోర్స్ బాల్ భారతిలో చదువు పూర్తిచేసి, కెనడాలో ఆధునిక విమాన శిక్షణ పొందారు. సహారా ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆయన గత ఐదేళ్లుగా వీఎస్ఆర్ ఏవియేషన్లో పని చేస్తున్నారు. ఆసక్తికరంగా, ఆయన కుమారుడు మరియు అల్లుడు కూడా పైలట్లే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!