

దేశంలో ఇప్పటికే అనేక విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు విమానయాన శిక్షణ రంగం లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాల్లో మరింత విస్తరించాలని చూస్తున్న సంస్థ, ఈ లక్ష్యంతో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (FSTC) ను కొనుగోలు చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోలు పై అదానీ డిఫెన్స్ విభాగం ప్రారంభ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
పైలట్ శిక్షణ పొందిన కాక్పిట్ సిబ్బందికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, అదానీ గ్రూప్ విమానయాన శిక్షణ కోసం ప్రత్యేక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్ సేవలు అందించే ఎయిర్ వర్క్స్ సంస్థను అదానీ గ్రూప్ కొన్న విషయం తెలిసిందే.
రాబోయే పది సంవత్సరాల్లో భారత్లో సుమారు 20,000 మంది కొత్త పైలట్లు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 98,000 మంది పైలట్లు అవసరం అవుతారన్న అంచనాలు ఉన్నాయి. పైలట్లకు సిమ్యులేటర్ ఆధారిత శిక్షణ తప్పనిసరి కావడంతో, ఈ విస్తృత అవకాశాల దృష్ట్యా అదానీ గ్రూప్ విమానయాన శిక్షణ వ్యాపారంపై దృష్టి సారించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!